వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనమే నయం: టిడిపి నేతలకు నారా లోకేష్ ఓదార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నాయకులకు ఓదార్పు మాటలు చెప్పారు. హైదరాబాదులోని మెజారిటీ స్థానాల్లో తమ పార్టీ రెండో స్థానంలో ఉందని ఆయన ఊరట చెందే మాటలు చెప్పారు.

కాంగ్రెసు మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన శుక్రావరం సాయంత్రం పార్టీ సీనియర్లతో ఫోన్‌లో మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తామని నారా లోకేశ అన్నారు.

Nara Lokesh odarpu to TDP leaders

ఈ ఫలితాలపై శుక్రవారం సా యంత్రం ఆయన ట్వీట్‌ చేశారు. తాము ప్ర జల తీర్పును గౌరవిస్తున్నామని, తమ ఎజెండా అభివృద్ధి. దాని కోసం మా పోరాటం కొనసాగిస్తామని ఆయన ట్వీట్టర్‌లో చెప్పారు.

కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో నారా లోకేష్ అన్నీ తానై వ్యవహరించారు. ప్రచార బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. అయితే, టిడిపి ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది.

English summary
Telugu Desam Party leader Nara Lokesh spoke to the senior leaders on GHMC elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X