వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఊడ్చేశారు, టిలో: బీజేపీకి నాయిని వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పైన తెలంగాణ ముఖ్యమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని చీపుర్లతో ఊడ్చేశారని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడ కాళ్లు, చేతులు విరగ్గొడుతారన్నారు.

ఢిల్లీ స్థాయి పార్టీ గల్లీ పార్టీగా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని చెప్పారు. నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీరు వెళ్లకుండా తమ రాష్ట్ర పోలీసులే అడ్డుకున్నారని తెలిపారు.

ప్రభుత్వ లాంఛనాలతో స్వాతంత్య్ర సమరయోధుడి అంత్యక్రియలు

Nayini lashes out at BJP

స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆయ అంత్యక్రియలకు డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు, అధికారులు పాల్గొన్నారు.

స్వామిగౌడ్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల వినతిపత్రం

అనర్హత పిటిషన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు సోమవారం మండలి చైర్మన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అయితే చైర్మన్‌ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడుధోరణి అవలంభిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకర్‌ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల మద్దతుతో స్వామిగౌడ్‌ చైర్మన్‌ స్థానంలో కూర్చున్నారని ధ్వజమెత్తారు.

English summary
Telangana Minister Nayini Narasimha Reddy lashes out at BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X