ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ కేసులో మరో కొత్త ట్విస్ట్
లారీ డ్రైవర్ను బెదిరించి ప్రయివేటు బౌన్సర్లతో దాడి చేయించిన ఏఎంవీఐ స్వాది గౌడ్ కేసులో మరో కొత్త ట్విస్ట్.
హైదరాబాద్: లారీ డ్రైవర్ను బెదిరించి ప్రయివేటు బౌన్సర్లతో దాడి చేయించిన ఏఎంవీఐ స్వాది గౌడ్ కేసులో మరో కొత్త ట్విస్ట్. స్వాతి గౌడ్, ఆమె మనుషులు తమపై దాడి చేశారని కేసు పెట్టిన వ్యక్తికి లారీకీ సంబంధం లేదని తెలుస్తోంది.
లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తారని స్వాతిగౌడ్ పైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు స్వాతి సోదరుడిని అరెస్టు చేశారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.
సోదరుడి అరెస్ట్: అర్ధరాత్రి చేయి పట్టుకుంటే.. స్వాతిగౌడ్ ట్విస్ట్
ఈ సమయంలో తాజాగా మరో అంశం వెలుగు చూసింది. తనపై స్వాతిగౌడ్ మనుషులు దాడి చేశారని చెప్పిన వ్యక్తికి, ఆ రోజు రాత్రి స్వాతిగౌడ్ ఆపిన లారీతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.
లారీకి యజమానిని తానే అని చెబుతూ సదరు వ్యక్తి స్వాతి గౌడ్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన సోదరుడికి ఫోన్ చేయడంతో వారు వచ్చి కొట్టారని అంటున్నారు.
సదరు లారీ డ్రైవర్ ఓనర్ పేరు శ్రీనివాస్ రెడ్డి. అతను ఆ రోజు రాత్రి అసలు ఆ ఛాయలకే రాలేదని అంటున్నారు. కానీ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి కేసు పెట్టాడు. దీంతో ఓనర్కు, ఈయనకు ఏం సంబంధం, ఈయన ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.