కొత్త ఏడాది సంబరాల్లో జనాలు, బ్యాంకులో చోరీకి కొందరి యత్నం
హైదరాబాద్: అందరూ న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు కొందరు. ఈ సంఘటన హైదరాబాదు సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్లో చోటు చేసుకుంది.
అబ్దుల్లాపూర్ మెట్లోని గ్రామీణ వికాస బ్యాంకులో కొందరు ఆదివారం అర్ధరాత్రి చోరీకి ప్రయత్నం చేశారు. అందరూ కొత్త ఏడాది సంబరాల్లో మునిగితేలడంతో తమ పని సులువు అవుతుందని భావించారు.

కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కన్నం వేసి లోపలకు వెళ్లారు. కానీ లాకర్లు తెరుచుకోలేదు. దీంతో వెనుదిరిగారు. అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లోని వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల్లో పలుచోట్ల కొన్ని విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications