ఎందుకిలా :పెళ్ళేై నాలుగు మాసాలే, దంపతులిలా చేశారు
పెళ్ళి జరిగి నాలుగు మాసాలే, చిన్న గొడవకే భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఈ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్ :పెళ్ళి జరిగి నాలుగు మాసాలే, చిన్న గొడవకే భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఈ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని కెందర్ పడ జిల్లా పాటియా గ్రామానికి చెందిన నిర్మల్ , అతని భార్య మినతి బతుకుదెరువు కోసం హైద్రాబాద్ లోని ఐడిఏ బొల్లారంలో నివాసం ఉంటున్నారు.
నాలుగు మాసాల క్రితమే మినతిని నిర్మల్ వివాహం చేసుకొన్నాడు. ఐడిఏ బొల్లారంలో నిర్మల్ ప్లంబర్ గా పనిచేస్తున్నాడు.అయితే సోమవారం నాడు ఉదయం భార్య, భర్తల మద్య చిన్న గొడవ జరిగింది.

ఈ గొడవ తర్వాత నిర్మల్ పనికి వెళ్ళాడు. మధ్యాహ్నం పూట బోజనానికి వచ్చిన నిర్మల్ కు భార్య కన్పించలేదు. బాత్ రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి ఆమె చున్నీతో ఉరివేసుకొని కన్పించింది.
మినతి చనిపోవడంతో మనస్థాపానికి గురైన నిర్మల్ కూడ ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే భార్య, భర్తల మద్య గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications