ఐఎస్ఐఎస్ లింక్స్: తెలంగాణతోపాటు ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్ఐఏ దాడులు చేసింది. ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి ఏడు రాష్ట్రాల్లోని 14 అనుమానితుల ప్రాంగణాల్లో ఎన్ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించింది. వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
మధ్యప్రదేశ్లోని భోపాల్, రైసెన్ జిల్లాల్లో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. గుజరాత్లోని భరూచ్, సూరత్, నవ్సారి, అహ్మదాబాద్ జిల్లాలు, బీహార్లోని అరారియా జిల్లాలు, కర్ణాటకలోని భత్కల్, తుమకూర్ సిటీ జిల్లాలు, మహారాష్ట్రలోని కొల్హాపూర్, నాందేడ్ జిల్లాలు, ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్ జిల్లాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. మరోవైపు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్పూర్ లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
IPCలోని సెక్షన్లు 153A, 153B, UA (P) చట్టంలోని 18, 18B, 38, 39 & 40 సెక్షన్ల కింద జూన్ 25, 2022న NIA ఈ కేసును సుమోటోగా నమోదు చేసింది.

ఆదివారం నిర్వహించిన సోదాలు నేరారోపణ పత్రాలు/మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
అంతేకాకుండా, ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధాలు కలిగి ఉన్న ఫుల్వారీ షరీఫ్ కేసుకు సంబంధించి గురువారం ఉదయం నుంచి నలంద జిల్లాతో సహా బీహార్లోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహిస్తోంది.
ఎన్ఐఏ కేసు నమోదు చేసి, కేసుపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించిన దాదాపు వారం రోజుల తర్వాత ఈ దాడులు నిర్వహించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఈ దాడులు జరుగుతున్న స్థలాలన్నీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ)కి సంబంధించిన వ్యక్తులకు చెందినవని చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
పీఎఫ్ఐ "టెర్రర్ మాడ్యూల్" కేసును బీహార్ పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్టు చేయడంతో గ్రూప్తో ఆరోపించిన సంబంధాలు, "యాంటీ-ఇండియా" కార్యకలాపాలలో పాల్గొనడానికి వారి ప్రణాళికలను కనుగొన్నారు.
తెలంగాణలోని ఆర్మూర్లో ఎన్ఐఏ సోదాలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఎన్ఐఏ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో అనుమానిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విదేశాల నుంచి నగదు బదలాయింపు జరిగినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో సోదాలు నిర్వహించగా ఇద్దరిని అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అనుమానితులను హైదరాబాద్కు తరలించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications