ప్రగతిభవన్ లో కోడ్ సమయంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరగలేదట .. సిఈఓ రజత్ కుమార్ మాట
ఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు తెలంగాణా ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమార్ . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవనం లో పార్టీ సమావేశాలు నిర్వహించడంపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమి నేతలు ఎన్నికల ముఖ్య అధికారికి ఫిర్యాదు చేశారు.దీనిపై ఎన్నికల ముఖ్య అధికారి టిఆర్ఎస్ కు నోటీసు జారీ చేశారు. మంత్రుల నివాస ప్రాంగణం, అధికారిక భవనాల్లో పార్టీ ఎన్నికల భేటీలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసు లో కోరారు. ఇక తాజాగా కోడ్ ఉల్లంఘన ఏమి జరగలేదని చెప్తున్నారు రజత్ కుమార్.ప్రగతి భవన్ లో సమావేశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ఛీప్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. ఇరవైనాలుగు గంటలలో వివరణ ఇవ్వాలని కోరారు.
అయితే అలాంటి సమావేశాలేవీ జరగలేదని వివరణ ఇచ్చారు. దీంతో ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లో ఎలాంటి పార్టీ కి సంబంధించిన సమావేశాలేమి కూడా జరగలేదని చెప్పారు. తన నివాసాన్ని కెసిఆర్ ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కెసిఆర్ కోడ్ ఉల్లంఘించారు అని చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణాలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటినుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో, ఆమె కుమారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన పై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఈవోను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా, స్థానిక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి దర్యాప్తు చేశారని, అసలు అలాంటి సమావేశాలు ప్రగతి భవన్ లో ఎలాంటి సమావేశాలు జరగలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే సమాచారాన్ని రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం అందించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications