ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒకరు ముందు ఇంటర్ ఫలితాలను ఇచ్చేందుకు హడవిడి పడుతున్నారు అధికారులు,ఇందులో జవాబు పత్రాలను మూల్యంకనం చేసే టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
దీంతో రోజుకు 30 పేపర్లు మాత్రమే మూల్యంకనం చేయాల్సిన టీచర్లపై 45 పేపర్ల వరకు భారం వేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.ఒత్తిడి పెంచితే పిల్లల భవిష్యత్ సైతం ఇబ్బంది పడుతుందంటూ ఆందోళన వ్యక్తం అయింది.దీంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు.
అందరు భావిస్తున్నట్టుగా ఫలితాలకు తొందర లేదని తెలిపారు. ఈనేపథ్యంలోనే ముందుగా ప్రకటించినట్టుగా ఏప్రిల్ తోమ్మిది లేదా పదిన ప్రకటించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.సో అధికారులు నిర్ణయంతో అటు లెక్చరర్లు ఇటు విద్యార్ధులు కూడ ఊపిరి పీల్చుకోనున్నారు.