ఇంటి నుంచి గెంటేస్తే ఈ రాజయ్య బతుకిలా అయింది
ఇంటి నుంచి గెంటేయడంతో ఓ వృద్ధుడు దిక్కు మొక్కు లేనివాడయ్యాడు. అతను పార్కుకు ఆనుకుని ఉన్న షెడ్డులో బతుకీడుస్తున్నాడు.
వరంగల్ : కొడుకు సరిగా చూసుకోకపోగా ఇంటి నుంచి గెంటి వేయడంతో ఓ వృద్ధుడు ఇక్కట్ల పాలై హన్మకొండ పబ్లిక్ గార్డెన్ను ఆనుకొని ఉన్న షెడ్డులో ఉంటూ బతుకీడుస్తున్నాడు. ఆకలితో పోరాటం చేస్తూ చేరదీసే వాళ్లు లేక అచేతన స్థితిలో కొట్టుమ్టిడుతున్నాడు. కన్నీిని కనురెప్పల మాటున అదిమి పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నాడు.కొడుకు ఆర్టీసీలో కండక్టర్ (హుజూరాబాద్ డిపో) ఉద్యోగి అయినా మానవత్వానికి మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.
వివరాల్లోకి వెళితే... హసన్పర్తి మండల పరిధిలోని పెంబర్తి గ్రామంలో మండల రాజయ్య (65) జీవనం సాగించేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉండగా చదివించి పెళ్లిళ్లు చేసి ఉన్నత స్థానంలో నిలబ్టెాడు. కొడుకు ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగి. అయితే రాజయ్య భార్య సుగుణ మూడేళ్ల క్రితం మరణించింది. తనకున్న పొలంను పిల్లలకు అప్పజెప్పాడు. ఇక్కడ నుంచి రాజయ్యకు కష్టాలు చుట్టుమ్టుాయి.

రేకుల షెడ్డే ఆయన జీవనం...
కన్న కొడుకు రాజయ్యను కాదని బయటకు గెంటేశాడు. దీంతో ఆయన ఉన్న ఊరును వదిలి రోడ్డెక్కాడు. హన్మకొండకు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురికాగా, కాలు విరగడంతో 108ద్వారా ఎంజీఎంకు స్థానికులు తరలించారు. మూడు నెలలు వైద్యం పొందినప్పికీ ఎవ్వరు ఎంజీఎం వైపు తొంగి చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. నా సేవలన్నీ ఎంజీఎం వాళ్లు చూసుకున్నారన్నాడు.
ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక పబ్లిక్ గార్డెన్కు ఆనుకొని ఉన్న రేకుల షెడ్స్ 95 నెంబరులో కాలం వెళ్లదీస్తున్నాడు. అక్కడే యాచిస్తూ జీవనం సాగిస్తున్న తనకు రాత్రి వేళలో పోలీసులు, మరోపక్క కుక్కల పాట్లు తప్పడంలేదని కన్నీి పర్యంతమయ్యాడు. తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటున్న నేటి పరిస్థితుల్లో ఆదరించిన కొడుకులు ఇలాిం వారు సమాజంలో ఉండటం కలవరపరుస్తోంది. అనాథగా మిగిలిన తనకు అండగా ఉండాలని, ఆప్తులు, స్వచ్ఛంద సంస్థలు చేయూత ఇవ్వాలని రాజయ్య కోరుతున్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications