Omicron: దక్షిణాఫ్రికా వేరియంట్పై తెలంగాణ సర్కారు అలర్ట్, రేపు కీలక భేటీ, ఆంక్షలు!
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొత్తి వేరియంట్ ఓమిక్రాన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు ఆదివారం సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్పై కేంద్రం అలర్ట్
ఇదే అంశంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు పలు దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులను క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్ను శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు.

హరీశ్ రావు భేటీ.. కొత్త వేరియంట్పై చర్చ
ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్కు విమానాలు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్ వచ్చేవారిని ట్రేసింగ్, టెస్టింగ్ సహా పలు అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో మంత్రి హరీశ్ రావు చర్చించనున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులపై పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్తవేరియంట్ బాధితుల ట్రేసింగ్, టెస్టింగ్పై పలు మార్గర్శకాలను విడుదల చేయనుంది. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు కరోనా డోసులు తీసుకుని ఉండాలని.. మార్గర్శకాలను పాటించాలని ఆంక్షలు విధించింది. చెన్నై విమానాశ్రయంలోనూ ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారు.

హైదరాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్
ఈ క్రమంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించి, నిఘాను కట్టుదిట్టం చేయాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. బోట్స్వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్ల దేశాల్లో ఇప్పటికే వేరియంట్ కనుగొనబడిన దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికులను నిశితంగా పర్యవేక్షించడానికి, క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బృందాలు. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలోని ఆరోగ్య బృందాలు కఠినమైన పరీక్షలు నిర్వహిస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల పరిచయాలు నిశితంగా ట్రాక్ చేయబడతాయి, పరీక్షించబడతాయి. కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిప్తోంది. మళ్లీ గత ఏడాది పరిస్థితులు తీసుకొస్తుందా? అని ఆందోళన చెందుతున్నాయి.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications