సీఎం అభయమని కవిత, కెసిఆర్ని మెచ్చుకున్న జయసుధ (పిక్చర్స్)
హైదరాబాద్: మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టిఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం అన్నారు. షీ టీమ్స్ వార్షికోత్సవంలో కవిత, మాజీ ఎమ్మెల్యే జయసుధ, నగర కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహిళల భద్రత కోసం రాష్ట్రంలో పోలీస్ షీ టీమ్స్ను ప్రవేశపెట్టారని, ఇలాంటి విధానం దేశంలో మొట్టమొదటిదన్నారు. అభద్రతతో మహిళలు సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటుచేసి వారికి అండగా నిలిచిందన్నారు.
షీ టీమ్స్ ఏర్పాటు వల్ల దేశంలో హైదరాబాద్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని కల్వకుంట్ల కవిత చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ మాట్లాడుతూ... మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.
కాగా, షీ టీమ్స్ హైదరాబాదులో బాగా పని చేస్తున్నాయని ప్రశంసలు అందుకుంటున్నాయి. తొలి ఏడాదిలో షీ టీమ్స్ 825 మంది పైన కేసులు బుక్ చేశాయి. నిందితులు... 118 మంది మైనర్లు సహా చాలామందిని బహిరంగంగా కూడా వేధించారు.

షీ టీమ్స్
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో షీ టీమ్స్ వార్షిక ఉత్సవాలు జరిగాయి. అంతకుముందు షీ టీమ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే జయసుధ, ఎంపీ కవితలు జెండా ఊపి ప్రారంభించారు.

షీ టీమ్స్
పోకిరీలను పట్టిచ్చిన ఐదుగురికి అవార్డులు కూడా ఇచ్చారు. కార్పొరేట్ సెక్టర్లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పనిచేస్తున్న తీరును ఎంపీ కవిత కొనియాడారు.

షీ టీమ్స్
పోకిరీల బెడదపై శ్రీదేవి కాలేజీ విద్యార్థినులు ప్రదర్శించిన నాటిక, ఫైటర్లు రవి, లక్ష్మి ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ చిట్కాలు సభికులను ఆకట్టుకున్నాయి.

షీ టీమ్స్
పోకిరీల బెడదపై శ్రీదేవి కాలేజీ విద్యార్థినులు ప్రదర్శించిన నాటిక, ఫైటర్లు రవి, లక్ష్మి ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ చిట్కాలు సభికులను ఆకట్టుకున్నాయి.

షీ టీమ్స్
పోకిరీల బెడదపై శ్రీదేవి కాలేజీ విద్యార్థినులు ప్రదర్శించిన నాటిక, ఫైటర్లు రవి, లక్ష్మి ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ చిట్కాలు సభికులను ఆకట్టుకున్నాయి.

షీ టీమ్స్
ప్రభుత్వం భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఏ సేఫ్ ప్లేస్ అన్న పేరు సంపాదించుకుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.

షీ టీమ్స్
మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ మాట్లాడుతూ... మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.

షీ టీమ్స్
పోకిరీల వల్ల ఇబ్బందులు ఎదురైనపుడు మహిళలు సంకోచించకుండా ధైర్యంగా షీ టీమ్స్కు చెప్పి వారి భరతం పట్టాలని ఎంపీ కవిత సూచించారు.

షీ టీమ్స్
షీ టీమ్స్ బలపడడానికి పోలీసులు చేస్తున్న కృషిని ఎంపీ కవిత అభినందించారు. కార్పొరేట్ సెక్టర్లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పని చేస్తున్న తీరును కొనియాడారు. భద్రతాచర్యలను ఇంకా పెంచి మహిళలకు మరింత భరోసా ఇవ్వాలని అన్నారు.

షీ టీమ్స్
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో షీ టీమ్స్ వార్షిక ఉత్సవాలు జరిగాయి. పోకిరీలను పట్టించిన ఓ యువతికి అవార్డు అందిస్తున్న జయసుధ.

షీ టీమ్స్
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో షీ టీమ్స్ వార్షిక ఉత్సవాలు జరిగాయి. పోకిరీలను పట్టించిన ఓ యువతికి అవార్డు అందిస్తున్న కవిత.

షీ టీమ్స్
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో షీ టీమ్స్ వార్షిక ఉత్సవాలు జరిగాయి. పోకిరీలను పట్టించిన ఓ యువతికి అవార్డు అందిస్తున్న కవిత.

షీ టీమ్స్
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో షీ టీమ్స్ వార్షిక ఉత్సవాలు జరిగాయి. పోకిరీలను పట్టించిన ఓ యువతికి అవార్డు అందిస్తున్న జయసుధ.

షీ టీమ్స్
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో షీ టీమ్స్ వార్షిక ఉత్సవాలు జరిగాయి. పోకిరీలను పట్టించిన ఓ యువతికి అవార్డు అందిస్తున్న దృశ్యం.

షీ టీమ్స్
ఎంపీ కవిత మాట్లాడుతూ... అభద్రతతో మహిళలు సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలిచిందన్నారు.












Click it and Unblock the Notifications