వల్లబాయ్ పటేల్ జీవిత చరిత్రను ఫాఠ్యాంశంగా చేర్చాలి. లక్ష్మణ్
హైదరాబాద్ :దేశ తొలి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
సర్థార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.పటేల్ కృషి వల్లే ఆనాడు హైదరాబాద్ భారత్ లో విలీనమైందన్నారు.
ఈనాటి తరానికి హైద్రాబాద్ చరిత్రను తెలిపాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనం కావడానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని మరువరానిదన్నారు. పటేల్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారాయన.పటేల్ జీవిత చరిత్రం ఆధారంగా ఈ తరానికి చరిత్ర గురించి తెలుసుకొనే అవకాశం దక్కుతోందన్నారు.