మరో కోణం.. రాజీవ్కు శిరీష సంబంధం చూసిందా: మిష్టరీ వీడినా...?
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు శుక్రవారం తేల్చారు. శిరీషకు రాజీవ్కు మధ్య వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు శుక్రవారం తేల్చారు. శిరీషకు రాజీవ్కు మధ్య వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు.
చదవండి: రాజీవ్తో శిరీషకు సంబంధంపై ఆగ్రహం
శిరీష ఆత్మహత్య, కుకునూరుపల్లిలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందని అభిప్రాయపడ్డారు. అయితే, మిష్టరీ వీడినట్లు కనిపించినప్పటికీ మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరో కోణం.. శిరీష రాజీవ్కు సంబంధం చూసిందా?
శిరీష, రాజీవ్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ఆమె అతనికి ఓ సంబంధం కూడా చూసిందనే వాదనలు కూడా ఉన్నాయి. తనకు తెలిసిన వాళ్ల సంబంధాన్ని శిరీష చూసిందని తెలుస్తోంది. అంతలోనే బెంగళూరుకు చెందిన తేజస్వినితో రాజీవ్కు పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో శిరీషతో రాజీవ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారనే వాదనలు తెరపైకి వచ్చాయి.

తేజస్విని ద్వారా వదిలించుకునే ప్రయత్నం..
తేజస్విని పరిచయం కావడంతో శిరీషను వదిలించుకునేందుకు రాజీవ్ ప్రయత్నాలు చేశాడని అంటున్నారు. తేజస్విని పావుగా వాడుకొని ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది.

మిస్టరీ వీడింది.. అనుమానాలు ఎన్నో..
శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. అయితే పోలీసుల ప్రెస్ మీట్ తర్వాత అనుమానాలు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి.

శిరీషను ఎస్సైకి అప్పగించాలని చూశాడా?
శిరీషను కుకునూరుపల్లి తీసుకు వెళ్లిన రాజీవ్.. ఆమెను అక్కడ ఎస్సైకి అప్పగించాలని చూశాడా? శిరీష ఎస్సై గదిలో అరిచినప్పుడు అక్కడి పోలీసులకు ఆ అరుపులు వినిపించలేదా? అసలు నిత్యం సెక్యూరిటీ ఉంటే క్వార్టర్సులోకి వారు ఎలా వెళ్లారు? ప్రభాకర్ రెడ్డ ఓ ఎస్సై అయి ఉండి రాజీవ్, శ్రవణ్లను వ్యభిచార గృహాలకు వెళ్లమని చెప్పడం ఏమిటి? అసలు శిరీష ఎందుకు అరిచింది? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

గొడవ జరిగిందే ఆమె కోసం..
రాజీవ్ - శిరీషల మధ్య గొడవ వచ్చిందే తేజస్విని కారణంగా. అలాంటప్పుడు పోలీసులు ఆమెను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఆమె పైన కేసు కూడా ఉండదని చెప్పడం ఏమిటని అంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications