భలే మిత్రులు: చోరీల్లో చేయి చేయి కలిపి..... (ఫొటో)
హైదరాబాద్: ఇద్దరు మిత్రులు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఇద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ఆ ఇద్దరినీ హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ మండలం కొండపేట కాలనీ నివాసి అరికిచర్ల రామ్మోహన్(30) భార్యతో కలిసి 2011లో నగరానికి అపురూపకాలనీలో ఉంటున్నాడు.

కృష్ణా జిల్లా గూడూరు మండలం జక్కంచర్లకు చెందిన వెంకటసుబ్బారావు 2009లో కుటుంబసమేతంగానగరానికి వచ్చి వివేకానందనగర్లో కాపురం పెట్టాడు. ఇరువురు బాలానగర్లోని ఓ రంగుల పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. రామ్మోహన్ గతంలో ఐదు బైకులను చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు.
తన తోటీ కార్మికుడు వెంకటసుబ్బారావుతో కలిసి జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు బైకులు దొంగిలించడం మొదలు పెట్టారు. జీడిమెట్ల, మాదాపూర్, రాయదుర్గం ఠాణాల పరిధుల్లో మొత్తం 19 వాహనాలు దొంగిలించారు.
వాహనాల కాగితాలు పోయాయయని చెబుతూ రూ.5 నుంచి 10 వేలకు వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమవారం ఉదయం షాపూర్నగర్లోని తిరుమల బేకరీ ముందు నిలిపిన హీరోహోండాను దొంగిలించిన వీరు ఆ వాహనంపై వెళుతూ అదే సమయంలో కుత్బుల్లాపూర్ కూడలిలో తనిఖీ చేస్తున్న జీడిమెట్ల పోలీసులకు పట్టుబడ్డారు.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications