ఆగడాలు: పోలీసుల స్పెషల్ డ్రైవ్, అరెస్టు(ఫోటోలు)
హైదరాబాద్: బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళలు, వికలాంగులు బోగీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న 44 మందిని, ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 8 మందిని, సాధారణ టికెట్ తీసుకొని మొదటి తరగతిలో ప్రయాణిస్తున్న 22 మందిని, 8 మంది హిజ్రాలను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఆర్ఫీఎఫ్ ఇన్ స్పెక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, వికలాంగుల బోగీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వారిపట్ల, రైళ్లలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని చెప్పారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళలు, వికలాంగులు బోగీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న 44 మందిని అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
వీరితో పాటు ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 8 మందిని, సాధారణ టికెట్ తీసుకొని మొదటి తరగతిలో ప్రయాణిస్తున్న 22 మందిని, 8 మంది హిజ్రాలను అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఆర్ఫీఎఫ్ ఇన్ స్పెక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, వికలాంగుల బోగీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వారిపట్ల, రైళ్లలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని చెప్పారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
నో పార్కింగ్ వద్ద వాహనాలు నిలిపిన 28 మందిని, రైల్వేస్టేషన్ ప్రాంతంలో అడుక్కుంటున్న 14 మందిని గుర్తించి కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
మొత్తం రూ. 36,500 జరిమానాలు రూపంలో వసూలు చేశారు. తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అర్ఫీఎఫ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.