వ్యభిచార గృహంపై పోలీసుల దాడి, యువతుల అరెస్ట్
హైదరాబాద్: ఉప్పల్లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ఆదివారం రాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. బంగ్లాదేశ్లోని ఢాకాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న నిర్వాహకుడు జబ్బార్ అలియాస్ బినోద్(34), అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు సెక్స్వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనం, ఆర్సీ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జబ్బార్ గతంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుపుతూ పట్టుబడ్డట్టు తెలిసింది. మరో ప్రాంతంలో కూడా ఆదివారం మధ్యాహ్నం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ (38) పద్మావతి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారమందుకున్న ఉప్పల్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం దాడి చేసి ఓ యువతితో పాటు నరేందర్ (37), మల్లేష్ (28)ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
యువకుడి బలికి యత్నం
ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఘట్కేసర్లోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లిన సంఘటన చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్శిగుట్ట సంజీవనగర్కు చెందిన శివ (23) కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు.
శనివారం ఉదయం 9 గంటల మధ్యన పార్సిగుట్టలో కేబుల్ రిపేర్కు వెళుతుండగా ఆటోలో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ఆగంతకులు కేబుల్ రిపేరు ఉంది అటోలో రమ్మని అడిగారు. శివ పట్టించుకోకుండా ముందుకు నడుస్తుండగా ఆటోలో వచ్చిన నలుగురిలో ఒకరు మత్తుమందు కలిగిన కర్చ్ఫీను ముక్కు దగ్గర పెట్టడంతో సృహకోల్పోయాడు.
అతడిని ఆటోలో ఘట్కేసర్ వరకు తీసుకెళ్లిన దుండగులు నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. తర్వాత అతనిపై పసుపు, కుంకుమ చల్లారు. తర్వాత అతనికి పూర్తిగా స్పృహ తప్పడంతో ఏం జరిగిందో తెలియదు. స్పృహ వచ్చిన తర్వాత చూస్తే తాను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
శనివారం రాత్రి నేరుగా చిలకలగూడ పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఘట్కేసర్ ప్రాంతానికి పంపించారు. కాగా, తనను నరబలి ఇవ్వడానికే గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారని బాధితుడు శివ తెలిపాడు.
తనను నిర్మానుష్య ప్రదేశంలో పడుకోబెట్టి కొందరు కోళ్లు, నిమ్మకాయలు వంటి సామాగ్రి కోసం వెళ్లినట్లు తెలిసిందని తాను తప్పించుకు రాకపోతే బలి ఇచ్చేవారని, తనపై ఉన్న పసుపు, కుంకుమలు చల్లిన విషయాన్ని బట్టి తెలుస్తుందని తెలిపారు.