మండుటెండల్లో తెలంగాణాకు వరుణుడి హెచ్చరిక... మూడురోజులు వర్షాలు!
తెలంగాణాలో ఒకపక్క ఈ నెలలోనే ఎండలు మండుతున్న తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. శ్రీలంక సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే భారీ వర్షాలకు అవకాశం లేదని, తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ రోజుల్లో కొన్ని జిల్లాలలో వర్షాలు
ఈ నెల 22, 23, 24 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం నుంచి తేమ గాలులు అల్పపీడనం వైపు కదులుతుండడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి ఎండలు కూడా గతం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
నిన్న భద్రాచలంలో 1.1 డిగ్రీలు పెరిగి 36.2°Cగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి, ఖమ్మంలో 2.3 డిగ్రీలు పెరిగి 35.4°Cగా నమోదైంది. ఆదిలాబాద్లోనూ 1.6 డిగ్రీల పెరుగుదలతో 35.8°C ఉష్ణోగ్రత రికార్డయింది. మెదక్ మినహా తెలంగాణ వ్యాప్తంగా గాలిలో తేమ 35-42% మధ్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొందని అధికారులు వెల్లడించారు.
అప్పుడే మొదలైన ఏసీలు, కూలర్ల వినియోగం
తెలంగాణలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాల్సి ఉండగా, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే వేడి గాలులు, ఎండ తీవ్రత మొదలయ్యాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.
ఎండలకు జాగ్రత్త అంటున్న వైద్యులు
ప్రస్తుతం పెరుగుతున్న వేడి దృష్ట్యా వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. వచ్చే ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. అత్యవసరమైతే కాటన్ దుస్తులు, టోపీ లేదా గొడుగు వాడాలి. డీహైడ్రేషన్ ప్రమాదం ఉన్నందున, తేలికపాటి ఆహారం, పండ్ల రసాలు తీసుకోవాలి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండి, తరచుగా నీరు తాగి డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని వారు తెలిపారు.
-
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications