దేశ యువతకు రాజీవ్ గాంధీ ఐకాన్... ఆ పేరును మార్చడం దురదృష్టకరం... : రేవంత్ రెడ్డి
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు ఐకాన్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది రాజీవ్ గాంధే అన్నారు. యువతకు అవకాశాలు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని అన్నారు. దేశాభివృద్దిలో యువతదే ప్రధాన భూమిక అని రాజీవ్ గాంధీ విశ్వసించారన్నారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో జరిగిన జయంతి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు.
రాజీవ్ మంత్రివర్గంలో 40శాతం యువతకు అవకాశం ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. దేశ యువతకు ఇంత స్పూర్తినిచ్చిన నేత పేరిట ఏర్పాటు చేసిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రభుత్వం తొలగించడం దురదృష్టకరమన్నారు. గాంధీ కుటుంబంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపించారు.

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చడం బీజేపీ, మోదీ సంకుచిత బుద్ధికి నిదర్శనమని గతంలోనూ రేవంత్ విమర్శలు గుప్పించారు. యువతను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండడం సముచితమని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని.. ఆయన చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ చీఫ్ ప్రశంసించారు.
క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారంగా కేంద్రం ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని సీనియర్ నేత వీహెచ్ తదితరులు విమర్శించారు.
కాగా,మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరీ ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి రాజీవ్ గాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications