ఎస్సై రమేష్ మృతి: పోస్టుమార్టంలో సంచలన విషయాలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైన ప్రాథమిక అంశాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎస్ఐ రమేష్ మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నాయని ప్రాథమిక నివేదిక తెలియజేస్తోంది. అదే విధంగా తొడలు, అరికాళ్లపై రక్తం కమిలిన గుర్తులు ఉన్నాయని నివేదికలో చెప్పారు.
కర్రలతో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. తుది నివేదికను సీల్డ్కవర్లో పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామని వైద్యులు తెలిపారు. తన భర్తను హింసించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రమేష్ భార్య గీత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో మంత్రి మహేందర్రెడ్డి, ఇద్దరు ఇన్స్పెక్టర్ల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు రమేష్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేర్పల్లిపెద్దతండాలో ఎస్ఐ రమేష్ బంధువులు ఆందోళనకు దిగారు. రమేష్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. కాగా ఎస్ఐ రమేష్ మృతదేహానికి ఎస్పీ దుగ్గల్ నివాళులర్పించారు. ఎస్ఐ రమేష్ ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్పీ వివరించారు.
రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నల్లగొండ ఎస్పీ దుగ్గల్ చెప్పారు. రమేష్ నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చి ఎస్సై అయిన తీరును ఆయన వివరించారు. రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, దీంతో కేసును పూర్తి స్థాయిలో సిఐడి దర్యాప్తు చేస్తుందని ఆయన చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications