ఆ జీవో వివరాలు మా ముందుంచండి: హైకోర్టులో కేసీఆర్కు ఊరట
హైదరాబాద్: 123 జీవో విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మంగళవారం నాడు తాత్కాలిక ఊరట లభించింది. 123 జీవో పైన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఇది ప్రభుత్వానికి స్వల్ప ఊరట. తీర్పును గురువారానికి వాయిదా వేసింది.
వ్యవసాయ కూలీల పరిహారంతో కూడిన సవరణల జీవోలను తమ ముందు ఉంచాలని హైకోర్టు డివిజన్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది.

భూసేకరణ జీవో 123 రద్దు అంశంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీంతో, మంగళవారం విచారణ జరిగింది.
నిర్వాసితులకు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారికి ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాలు కల్పించే అంశంపై జీవో జారీ చేస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జీవో జారీ చేసి దాని ప్రతిని తమకు సమర్పించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications