ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా? సాక్ష్యాలతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రమాదం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరిగాయి. రంగారెడ్డి ఫస్ట్ పంపు హౌస్ తో పాటుగా అప్రోచ్ ఛానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ళతోనే ఈ ప్రమాదం జరిగిందని కల్వకుర్తి పంప్ హౌస్ నీట మిగిలిపోయిందని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరిగాయి . పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంప్ హౌస్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదం గురించి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు . ఈ మేరకు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు జ్ఞానం లేదంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి తనకంటే తెలిసినోడు ఎవడని ప్రశ్నించే కేసీఆర్ కు కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ లో ఒక ఇంజనీరుకు ఉన్నంత జ్ఞానం కూడా లేదే అంటూ ఎద్దేవా చేశారు.

లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరికలతో ఎస్ఈలు రాసిన లేఖలు .. బయటపెట్టిన రేవంత్
సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సాక్ష్యం ఇదిగో అంటూ లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరికలు జారీ చేస్తూ ఎస్ఈలు రాసిన లేఖలను ఆయన బయట పెట్టారు .
ఇది కల్వకుంట్ల అజ్ఞానమా ? దన దాహమా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వాస్తవాలు ఇవిగో అంటూ ప్రభుత్వానికి ఎస్ ఈ లు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ప్రమాదం చోటు చేసుకోవడంతో పంప్ హౌస్ లో 45 అడుగులకు పైగా నీరు చేరటం రాజకీయంగానూ దుమారం రేగింది.
Recommended Video

కల్వకుర్తి పంప్ హౌస్ ప్రమాదం నాటి నుండి కాంగ్రెస్ నేతల పోరాటం
కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌస్ పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన తర్వాత పంప్ హౌస్ పరిశీలనకు వెళ్లిన రేవంత్ రెడ్డి, మల్లురవి, సంపత్ కుమార్ తదితర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. అప్పటి నుండి కేసీఆర్ నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్న రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి తెలంగాణ ప్రభుత్వం అక్రమాలను చేస్తోందని మండిపడుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications