హీరోయిన్ల వద్దకు వెళ్తావు కానీ!: కేటీఆర్కు రేవంత్ రెడ్డి అల్టిమేటం
సినిమా హీరోయిన్లను పరామర్శించే మంత్రి కేటీఆర్కు నేరెళ్ల బాధితులను పరామర్శించే టైమ్ లేదా అని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు.
సిరిసిల్ల: సినిమా హీరోయిన్లను పరామర్శించే మంత్రి కేటీఆర్కు నేరెళ్ల బాధితులను పరామర్శించే టైమ్ లేదా అని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు.
నేరెళ్లలో బాధితులను కొట్టే అధికారం ఎస్పీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇసుకతో రూ.1000 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారని, మరి బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయరని ప్రశ్నించారు.

ఆగస్టు 15లోగా కేటీఆర్ బాధితులను పరామర్శించి, ఆదుకోకుంటే నేరెళ్లను ముట్టడించి, సంగతి తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు. బంధువులకే ఇసుక కాంట్రాక్టులు, తన ఆరోపణలు తప్పయితే నాపై కేసు పెట్టాలని సవాల్ చేశారు.
బాధితులపై థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగించారని మరో టిడిపి నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు రజాకార్ల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరేళ్ల ఘటనపై సంజాయిషీ చెప్పుకోవాల్సింది పోయి, సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో అహంభావంతో మాట్లాడారన్నారు.
-
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్ను దాటేస్తోందా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications