ఆత్మహత్య?: తుపాకీ పేలి బాధ్యతలు తీసుకున్న 2రోజులకే ఎస్ఐ మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని కెరమెరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ కావడంతో కెరమెరి ఎస్ఐ కె శ్రీధర్(27) మృతి చెందాడు. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా? లేదా శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అంశం ఇంకా తేలలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు రోజుల క్రితమే శ్రీధర్ కెరమెరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మూడు నెలల నుంచి కెరమెరిలో ట్రైనీ ఎస్ఐగా ఆయన పనిచేశాడు.
ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. కాగా, సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications