తెలంగాణాలో ఆ రైల్వే స్టేషన్ ప్రారంభం.. సంక్రాంతి కానుక!
భారతీయ రైల్వే అభివృద్ధి పనుల పైన ఫోకస్ చేస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ ను విస్తరించడంలో భాగంగా రంగంలోకి దిగిన భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల పైన కూడా ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో సంక్రాంతి వేళ భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త సంవత్సరం కానుకగా కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ జనవరి నెలలో ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త
కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ జనవరి రెండవ వారంలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుండి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు నిర్వహిస్తున్న 151 కిలోమీటర్ల రైల్వే లైన్ లో ఇది కీలక భాగంగా ఉండనుంది. కొమరవెల్లి మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ 2025 దసరా పండుగకు ముందు ప్రారంభించాలని భావించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కారణంగా అనేకమార్లు వాయిదా పడింది.

త్వరలో అందుబాటులోకి కొమురవెల్లి రైల్వే స్టేషన్
దీంతో భక్తుల విజ్ఞప్తుల మేరకు రైల్వే అధికారులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. కొత్తగా నిర్మించిన ఈ స్టేషన్ రాజీవ్ రహదారికి సమీపంలో కొండపాక గేటు నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అండర్ పాస్ దగ్గరలో ఉంది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కొమరవెల్లి మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగనున్నాయి.
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి లక్షల మంది భక్తులు
ప్రతి సంవత్సరం కొమురవెల్లి మల్లన్న జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సుమారు 25 లక్షల మంది ప్రతి సంవత్సరం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు .సంక్రాంతి తర్వాత మూడు నెలల పాటు జరిగే మహా జాతరకు 10 లక్షలకు పైగా జనాభా వస్తారు. ఇక వీరందరికీ కొమరవెల్లి లో రైల్వే స్టేషన్ రావడం శుభవార్త అని చెప్పవచ్చు.
ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే
ఈ రైల్వే స్టేషన్ ను మూడు కోట్ల రూపాయలతో అర ఎకరం స్థలంలో నిర్మించారు. 400 మీటర్ల పొడవైన ప్లాట్ ఫామ్ ని కూడా నిర్మాణం చేశారు. ప్రస్తుతానికి కొండపాక వైపు నిర్మాణం పూర్తయినప్పటికీ భవిష్యత్తులో మరో రైల్వే ట్రాక్ నిర్మించడం కోసం ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం కొమరవెల్లి రైల్వే స్టేషన్ కొమురవెల్లి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
కొమురవెల్లి చరిత్ర తెలిసేలా సుందరంగా రైల్వే స్టేషన్
రైల్వే స్టేషన్ నుంచి కొమరవెల్లి ఆలయానికి 500 మీటర్ల ప్రధాన రహదారిని ప్రత్యేకంగా సిసి రోడ్డు గా నిర్మించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని కొమురవెల్లి మల్లన్న చరిత్ర తెలిపే చిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు .స్టేషన్ భవనం, ప్రయాణికులు వేచి ఉండే గది, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, ప్లాట్ ఫామ్ వర్క్స్, టాయిలెట్ పనులు అన్ని పూర్తయ్యాయి. త్వరలో జనవరి నెలలోనే ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించడానికి రెడీ అవుతుంది దక్షిణ మధ్య రైల్వే.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications