ఆమెకు 55.. అతనికి 22! పెళ్లికి సిద్ధమయ్యారు.. పోలీసులు నచ్చజెప్పినా.
గోల్కొండ ధాన్కోటకు చెందిన అయేషాబేగం (55) భర్త నాలుగు నెలల క్రితమే మరణించాడు.
హైదరాబాద్: ఆమెకు 55. అతనికి 22. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెళ్లి వరకు వచ్చింది. ఇదేదో పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఘటన కాదు..సాక్షాత్తూ మన హైదరాబాద్లోనే జరుగుతోంది, ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరుకుంది.
ఈ చిక్కుముడి ఎలా విప్పాలో తెలియక తలపట్టుకోవడం పోలీసుల వంతయింది. గోల్కొండ ధాన్కోటకు చెందిన అయేషాబేగం (55) భర్త నాలుగు నెలల క్రితమే మరణించాడు. తర్వాత ఆమెకు, అదే ప్రాంతానికి చెందిన, ఓ కొరియర్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)ల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

Recommended Video

వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కాస్తా సహజీవనం వరకు వచ్చింది. ఇరు కుటుంబాల సభ్యుల నుంచి బెదిరింపులు రావడంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆదివారం గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు.
ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికే కట్టుబడటంతో పోలీసులు సైతం తలపట్టుకున్నారు. చేసేది లేక వారం రోజుల తర్వాత మళ్లీ స్టేషన్కు రావాలని సూచించి పంపారు. వారం రోజుల తర్వాత మతపెద్దల సమక్షంలో వీరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఐ తెలిపారు.
-
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications