రోహిత్, మెడికోల ఆత్మహత్య: జాతీయ జెండాను తగలబెట్టిన యువకుడు, ఫిర్యాదు
చెన్నై/హైదరాబాద్: తమిళనాడులోని చెన్నైలో దిగ్ర్భాంతికర ఘటన చోటు చేసుకుంది. దిలీపన్ మహేంద్రన్ అనే యువకుడు జాతీయ పతాకాన్ని కాల్చేశాడు. అంతేగాక, ఆ ఫొటోలను సోషల్ మీడియా అయిన ఫేస్బుక్లో పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు.
ఆ తర్వాత తన ఫేస్బుక్ ఖాతా నుంచి ఆ ఫొటోలు తొలగించినప్పటికీ.. అప్పటికే ఆ ఫొటోలు వాట్సప్ ద్వారా చాలా మందికి చేరిపోయాయి.
కాగా, తమిళనాడులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ముగ్గురు మెడికల్ విద్యార్థినులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోహిత్ ఆత్మహత్యలకు నిరసనగా తాను జాతీయ పతాకాన్ని దగ్ధం చేసినట్లు దిలీపన్ చెప్పుకొచ్చాడు.
ఫేస్బుక్, వాట్సప్లలో అతని ఫొటోలను చూసిన కొందరు మద్దతుగా నిలవగా.. అనేక మంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ పైలట్ తోపాటు మరో ఇద్దరు.. దిలీపన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో దిలీపన్ చర్యపై పలువురు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications