చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్, మెడికోల ఆత్మహత్య: జాతీయ జెండాను తగలబెట్టిన యువకుడు, ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

చెన్నై/హైదరాబాద్: తమిళనాడులోని చెన్నైలో దిగ్ర్భాంతికర ఘటన చోటు చేసుకుంది. దిలీపన్ మహేంద్రన్ అనే యువకుడు జాతీయ పతాకాన్ని కాల్చేశాడు. అంతేగాక, ఆ ఫొటోలను సోషల్ మీడియా అయిన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు.

ఆ తర్వాత తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఆ ఫొటోలు తొలగించినప్పటికీ.. అప్పటికే ఆ ఫొటోలు వాట్సప్ ద్వారా చాలా మందికి చేరిపోయాయి.

కాగా, తమిళనాడులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ముగ్గురు మెడికల్ విద్యార్థినులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోహిత్ ఆత్మహత్యలకు నిరసనగా తాను జాతీయ పతాకాన్ని దగ్ధం చేసినట్లు దిలీపన్ చెప్పుకొచ్చాడు.

ఫేస్‌బుక్, వాట్సప్‌లలో అతని ఫొటోలను చూసిన కొందరు మద్దతుగా నిలవగా.. అనేక మంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్ తోపాటు మరో ఇద్దరు.. దిలీపన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో దిలీపన్ చర్యపై పలువురు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary
Dilipan Mahendran, a resident of Chennai, has landed in legal trouble following his picture in which he was seen burning national flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X