ఎన్ కౌంటర్ కు ముందే రూ.12 కోట్లు సెటిల్ చేసిన నయీం, రూ.2 కోట్లు ఓ పోలీసుకు
గ్యాంగ్ స్టర్ నయీంతో లబ్దిపొందిన పోలీసు అధికారులు చాలామందే ఉన్నారని సిట్ అభిప్రాయపడుతోంది.ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడౌతున్నాయి. ఎన్ కౌంటర్ కు క
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో లబ్దిపొందిన పోలీసు అధికారులు చాలామందే ఉన్నారని సిట్ అభిప్రాయపడుతోంది.ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడౌతున్నాయి. ఎన్ కౌంటర్ కు కొద్దిసేపటికి ముందే రూ.12 కోట్ల డీల్ ను నయీం సెటిల్ చేశాడు.అయితే ఈ కేసును తీసుకువచ్చిన ఓ పోలీసు అధికారికి ఈ డీల్ లో రూ.2 కోట్లు లబ్దిచేకూర్చినట్టు సమాచారం.
గత ఏడాది ఆగష్టు 8వ, తేదిన జరిగిన షాద్ నగర్ లోని మిలినీయం సిటీలో జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ కు కొద్దిసేపటికి ముందే నయీం సుమారు రూ.12 కోట్ల విలువైన డీల్ ను సెటిల్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఈ డీల్ కు సంబంధించిన సీసీటీవి పుటేజ్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తోంది.

నయీం ఎన్ కౌంటర్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ తో అంటకాగిన పోలీసు అధికారులు ఎవరనే విషయమై ఇప్పటికీ సిట్ డీజీపీకి నివేదికను అందించింది.ఈ నివేదిక ఆదారంగా ఇప్పటికే ఐదుగురు పోలీసులపై డిజిపి చర్యలు తీసుకొన్నారు.
నయీం కు బినామీలుగా ఎవరెవరు వ్యవహరించారు. వారి వద్దకు వచ్చే స్థిరాస్తుల కేసులు, ఆస్తి పంపకాలు, ఇతర తీవ్రమైన వివాదాల కేసులను నయీంకు అప్పగించేవారు కొందరు పోలీసు అధికారులు. అయితే ఈ కేసులను అప్పగించినందుకుగాను నయీం ఈ పోలీసులకు భారీగానే ముట్టజెప్పేవాడు.
నయీంతో సంబంధాలు కలిగి ఉన్న ఓ పోలీసు అధికారి ఏకంగా 16 ఎకరాల స్థలాన్ని తీసుకొన్నట్టు సిట్ గుర్తించింది.2008 తర్వాత ఛత్తీస్ ఘడ్ కు చెందిన కొందరు ఐపీఎస్ అధికారులు నయీంతో సంబంధాలను కలిగి ఉన్నారని సిట్ దర్యాప్తులో తేలింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications