హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం, లాక్కెళ్లిన బ్యాగ్‌లో టిఫిన్ బాక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షాపూర్‌నగర్‌ ఉషోదయ టవర్స్‌లో రాత్రి రఘు శర్మ అనే వ్యక్తి పైన గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ఇనుప రాడ్డుతో దాడి చేసి కాల్పులు జరిపారు.

దాడి అనంతరం శర్మ చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని దుండగులు పరారయ్యారు. దుండగుల దాడిలో శర్మకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఘటనాస్థలంలో లభ్యమైన బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. శర్మకు బుల్లెట్‌ గాయాలు కాలేదని, ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో గాయాలయ్యాయి.

 Stranger firing in Jeedimetla

శర్మ తన ఫ్లాట్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బైకు పైన ఆ ముగ్గురు దుండగులు వచ్చారు. కాగా, ఈ ఘటనను ప్రతిఘటించేందుకు పక్కనే ఉన్న ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

ఆ సమయంలో దుండగులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. రఘుశర్మ సంచిలో టిఫిన్ బాక్స్ తప్ప మరేమీ లేదు. గాయాలబారిన పడిన రఘుశర్మను షాపుర్ నగర్‌లోని ఆ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. కాగా, రఘుశర్మ అకౌంటెంట్ అని తెలుస్తోంది.

English summary
Stranger firing in Jeedimetla on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X