వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెద్ద అంబర్ పేట వద్ద బస్సు బీభత్సం: విద్యార్థిని బిందు మృతి
హైదరాబాద్: పెద్ద అంబర్పేట్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బిందు అనే ఆరో తరగతి అమ్మాయి మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి ఓ ప్రయివేటు బస్సు కారణం. ఆ బస్సు అతివేగంతో వస్తూ అదుపు తప్పి ఓ కారు, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఇది విజయవాడ హైవే కావడంతో ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది.
బస్సులు, లారీలు ఇక్కడ వేగంగా వెళ్తుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Comments
English summary
Student killed and found injured in road accident at Pedda Amberpet on Wednesday morning.