Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భట్టీకి వడదెబ్బ తగిలింది ...కాంగ్రెస్ ప్రజా స్వామ్య పరిరక్షణ యాత్రకు బ్రేక్ పడింది

Recommended Video

    భట్టి విక్రమార్క కు వడదెబ్బ.. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు బ్రేక్ || Oneindia Telugu

    కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ ఫిరాయించిన నేతలకు నిరసనగా , నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు . భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నేపధ్యంలో విపరీతమైన ఎండల దెబ్బకు ఆయన ప్రారంభించిన యాత్రకు బ్రేక్ పడింది .మండుటెండలో చేపట్టిన యాత్ర కారణంగా ఆయనకు వడదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆయన ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    భట్టికి వడదెబ్బ ... కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ..

    భట్టికి వడదెబ్బ ... కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ..

    కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మే 01వ తేదీ రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వైద్య చికిత్స అందింస్తున్నారు . వడదెబ్బ కారణంగా జ్వరం వచ్చిందని..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు వైద్యులు. ఆయనకు రెస్టు అవసరమని సూచించారు. దీంతో ఆయన నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

    ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ద్వారా టీఆర్ఎస్ నియంత పాలనపై ప్రచారం

    ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ద్వారా టీఆర్ఎస్ నియంత పాలనపై ప్రచారం

    ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టారు . భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. రానున్న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల తరపున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రచారం చెయ్యటంతో పాటు , తెలంగాణాలోని అధికార పార్టీ చేస్తున్న నియంత పాలనపై ఈ యాత్ర ద్వారా ప్రచారం చెయ్యాలని భావించి ప్రారంభించారు.

    ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సాగనున్న యాత్ర

    ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సాగనున్న యాత్ర

    పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ అందులో భాగంగా ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలంటూ పోరాటం చేస్తుంది . ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్న నేపధ్యంలో భట్టికి వడదెబ్బ తగలటంతో తాత్కాలికంగా యాత్రకు ఆటంకం కలిగింది .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+