తెలంగాణ ప్రభుత్వానికి మరో దెబ్బ.. రిజర్వేషన్ల పెంపు పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
లోకల్ బాడీ ఎలక్షన్లలో 67 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని తేల్చింది సుప్రీంకోర్టు. బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉన్నందున తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా ఈ అంశం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే రిజర్వేషన్లు పెంచడం సబబుకాదని తెలంగాణ సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.













Click it and Unblock the Notifications