తెలంగాణాపై స్వైన్ ఫ్లూ పంజా; అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ; బీ అలెర్ట్!!
తెలంగాణలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. మూడు సంవత్సరాల విరామం తర్వాత స్వైన్ ఫ్లూ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసులు సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా నమోదు అవుతాయి. గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల నమోదైంది. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయింది.

తెలంగాణాలో స్వైన్ ఫ్లూ .. కేసులు పెరుగుతున్నాయన్న ఐపీఎం డైరెక్టర్
హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసుల విషయంలో వైరస్ కోసం పరీక్షించాల్సిన చాలా నమూనాలను నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కి పంపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల మాట్లాడుతూ 2021 మరియు 2020లో ఎలాంటి నమూనాలు పంపలేదని, ఇప్పుడు నమూనాలు అందుతున్నాయని, నమూనాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు.

గత రెండేళ్ళు స్వైన్ ఫ్లూ లేదు.. కానీ ఇప్పుడు మళ్ళీ ..
కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బహుశా హెచ్1ఎన్1 వ్యాప్తిని కూడా నిరోధించినట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లూ వ్యాక్సిన్ హెచ్1ఎన్1కు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అయితే దీన్ని ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో చాలా మంది రోగులు స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

తెలంగాణా వ్యాప్తంగా చాలా చోట్ల స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధితులు
తలనొప్పి, దగ్గు, జలుబు, కడుపు నొప్పి మరియు అతిసారం, కోవిడ్ మరియు బాక్టీరియల్ న్యుమోనియాలతో ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు అనుమానించాల్సి వస్తుందని, అందుకే వారి నమూనాలను పరీక్షల కోసం పంపిస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి కామన్ లక్షణాలు అనేకమందిలో ఉంటున్నాయని, అయితే గతానికి భిన్నంగా ఇప్పుడు చాలా కేసులు స్వైన్ ఫ్లూ కేసులు గా అనుమానించాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ లో స్వైన్ ఫ్లూ కేసుల నిర్ధారణ ... ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్యం
ఇప్పటి వరకు, స్వైన్ ఫ్లూ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదు, కానీ కొన్ని సందర్భాల్లో వారికి విపరీతమైన జ్వరం ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆగస్టు 13న ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో ఇద్దరికీ స్వైన్ఫ్లూ సోకినట్లు ఐపీఎంలో నిర్ధారణ అయింది. జిల్లాలో చాలా మంది వైరల్ జ్వరాలతో బాధపడుతున్నందున, జిల్లాలో హెచ్1ఎన్1 కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. తదనుగుణంగా స్వైన్ ఫ్లూ నివారణ కోసం వైద్యులు రంగంలోకి దిగి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications