జగన్ను టార్గెట్ చేయడానికి...: చంద్రబాబుపై తలసాని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని వాడుకున్నరని ఆయన అన్నారు.
ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు జగన్ ఒక్కరే కాదు, ఇతర ప్రతిపక్షాల పార్టీ నేతలెవరూ హాజరు కాలేదని ఆయన గుర్తు చేసారు. చంద్రబాబు విదేశాలు తిరుగుతున్నప్పటికీ పెట్టుబడులైతే రావడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలెవరూ చంద్రబాబును నమ్మడం లేదని ఆయన అన్నారు.

పెట్టుబడులు రాకపోవడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆ ప్రాంతానికి చెందిన తన మిత్రులు తనకు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు ఎపిలో మరోసారి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన చంద్రబాబును నిందించారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలు నెరరవేర్చకపోవడం వల్లనే ఎపిలో కాపులు ఉద్యమ బాట పట్టారని ఆయనఅన్నారు. బడ్జెట్లో కాపులకు కేటాయించిన వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అనేది అనుమానమేనని తలసాని అన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications