Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు: కాంగ్రెస్ లో సంక్షోభం.. బీజేపీలో సంబరం!!

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం బీజేపీకి లాభం చేకూరుస్తుందా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులను బీజేపీ ట్రాప్ చేస్తుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీ వేస్తున్న గాలానికి చిక్కే చేపలు ఎన్ని? కమలం తో టచ్ లోకి వెళ్ళిన హస్తం నేతలు ఎందరు? వంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న వర్గ పోరు కమలనాథులకు కలిసి వస్తుంది అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

తగవులకు నెలవుగా కాంగ్రెస్

తగవులకు నెలవుగా కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ తమను తాము చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని చూపించే ప్రయత్నం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని రోజురోజుకు అధోగతి పాలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పాత కొత్త నేతల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు వెరసి కాంగ్రెస్ పార్టీ తగవులకు నెలవుగా మారింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ట్రాప్ చేసే పనిలో బిజెపి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ట్రాప్ చేసే పనిలో బిజెపి


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించి తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్ల వర్గం రోజుకో రకంగా షాక్ ఇస్తుంది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి పై యుద్ధం ప్రకటించిన సీనియర్లు భట్టి విక్రమార్క ఇంట్లో చర్చలు జరుపుతూ బాహాటంగానే రేవంత్ ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తో కూడా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇక ఈ పరిణామాలు బీజేపీకి బాగా కలిసి వస్తున్నాయి. పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను బిజెపి ట్రాప్ చేసే పనిలో పడింది.

కాంగ్రెస్ నుండి 20 మందికి గాలం వేసిన బీజేపీ

కాంగ్రెస్ నుండి 20 మందికి గాలం వేసిన బీజేపీ



మాజీ మంత్రులు మొదలుకొని, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో పట్టున్న నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి 20 మంది నేతలకు బిజెపి గాలం వేసినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపి వారందరినీ కాషాయ దళం లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు గా కొనసాగి పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్న డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

బీజేపీకి కలిసొస్తున్న కాంగ్రెస్ సంక్షోభం

బీజేపీకి కలిసొస్తున్న కాంగ్రెస్ సంక్షోభం


కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ తదనుగుణంగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికలకు ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న బీజేపీ వివిధ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేల ఆధారంగా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న బలమైన నాయకులను, తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెసు సంక్షోభం బిజెపికి బాగా కలిసొస్తుందని చెప్పాలి.

కాంగ్రెస్ నాయకులకు బీజేపీ ఆఫర్.. కానీ కొత్త చిక్కు

కాంగ్రెస్ నాయకులకు బీజేపీ ఆఫర్.. కానీ కొత్త చిక్కు


అయితే బీజేపీలో వచ్చే ఎన్నికలకు టికెట్ ఇస్తే చేరుతాము అన్నట్టుగా కొందరు సీనియర్ నేతల తీరు ఉంది. కానీ బిజెపి నేతలు ఎవరూ టికెట్ హామీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉండాలా? లేక హామీ ఇవ్వని బిజెపిలోకి చేరాలా? అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ లో తాజా పరిణామాలు బిజెపి సాగిస్తున్న ప్రయత్నాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ క్రమంలోనే బిజెపి వేస్తున్న గాలానికి ఎన్ని చేపలు చిక్కుతాయి అన్న చర్చ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+