జ్వరం వస్తే కరోనా పరీక్షలు చెయ్యాల్సిందే.. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణా సర్కార్ నేడు కరోనా పాజిటివ్ కేసులు 36 కు చేరటంతో అత్యవసర సమావేశం నిర్వహించింది . ఇప్పటివరకు రోజుకు ఇన్ని కేసులు అన్ని లెక్కబెట్టింది కాస్తా ఇప్పడు గంటలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది .

కరోనా మూడో దశకు చేరుకునే సమయం దగ్గర పడుతుందని, ప్రమాద ఘంటికలు మోగుతాయన్న భయం తెలంగాణ సర్కారును టెన్షన్ పెడుతుంది. ఇక ఈ క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డిసైడయ్యింది. ఏ ఎన్ ఎంలు, ఆశా వర్కర్ల సాయంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇటింటికి వెళ్లి చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వీరు వెంటనే ప్రభుత్వానికి సమాచారం చేరవేయనున్నారు. అంతే కాదు ఏ కాస్త చిన్న జ్వరం వచ్చినా కరోనా పరీక్షలు చెయ్యాలని తీసుకున్న నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications