Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే వేదికపై రేవంత్- నాగ్- అల్లు అరవింద్

Miss World 2025: హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌.. ఈ విందుకు వేదిక అయింది. 109 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు, ప్రతినిధులతో చౌమొహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది.

ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Telangana govt hosting a Welcome dinner for the Miss World 2025 contestants in Hyderabad

టాలీవుడ్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా హీరో అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్స్ చీఫ్ దగ్గుబాటి సురేష్ బాబు ఈ విందులో పాల్గొన్నారు. విందు ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చౌమహల్లా ప్యాలెస్ - హైదరాబాద్ వారసత్వ సంపద అనే అంశంపై షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ప్యాలెస్‌ను సందర్శించిన కంటెస్టెంట్లు అక్కడ హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

నిజాం కాలం నాటి వస్తువులు, సైనిక సామగ్రిని తిలకిస్తూ వాటి విశిష్టత గురించి తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు తమనెంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈవో జూలియా మోర్లే గారితో పాటు పలువురు కంటెస్టెంట్లు విందు సందర్భంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

చౌమహల్లా ప్యాలెస్ అత్యంత అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చెప్పారు. హైదరాబాద్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని పంచుతోందని అభివర్ణించారు. తమకు ఈ పర్యటన జీవితాంతం గుర్తుండిపోతుందని, తెలంగాణ.. జరూర్ ఆనా నినాదం తమ దేశాల్లో వినిపిస్తామని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వ్యాఖ్యానించారు.

అంతకుముందు- 109 దేశాల నుండి మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్‌ను సందర్శించారు. దాని విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లంతా హైదరాబాద్ బ్యాంగిల్ హెరిటేజ్‌లో పాల్గొన్నారు. తర్వాత లాడ్ బజార్‌కు వెళ్లారు. అక్కడ కలియతిరిగారు. గాజులను కొనుగోలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+