పట్టాల దుస్థితి ఇలా?: కనీసం ఇంకో రెండురోజులు?
Heavy rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. పల్లెలు, పట్టణాలు ఏకం అయ్యాయి. చెరువులు, కుంటలు ఎక్కడికక్కడె తెగిపోయాయి. వరదనీరు జనావాసాల్లోకి పోటెత్తింది.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నేడు కూడా అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్షాల ధాటికి అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే పట్టాలపై వరద నీళ్లు ప్రవహించాయి. ట్రాక్ మొత్తం చాలావరకు ధ్వంసమైంది. పట్టాల కింద భూమి పలు చోట్ల కోతకు గురైంది.
జిల్లాలోని కేసముద్రం మండలం తాల్లపూసపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఓవర్ హెడ్ లైన్లు దెబ్బతిన్నాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లను మహబూబాబాద్లో నిలిపివేశారు.

అత్యంత రద్దీ మార్గం కావడం వల్ల దీన్ని పునరుద్ధరించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. ట్రాక్ పునర్నిర్మాణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తోన్నారు. మట్టి కోసుకుపోయిన చోట బౌల్డర్లు, సిమెంట్ బెడ్స్ను వేస్తోన్నారు. ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాల తీగలను సరిచేస్తోన్నారు.
ఈ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్వయంగా పర్యవేక్షించారు. 418, 432 కిలోమీటర్ వద్ద పట్టాలు బాగా దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతు పనులు పూర్తి చేస్తోన్నామని వివరించారు. ఈ మార్గంలో మొత్తం అయిదు చోట్ల పట్టాలు ధ్వంసం అయినట్లు గుర్తించామని అన్నారు. నాలుగుచోట్ల పునరుద్ధరణ పనులు ముగిశాయని తెలిపారు.
ఇదే మార్గంలో మరికొన్ని చోట్ల పట్టాలపై వరదనీరు ప్రవహించిందని, ఫలితంగా అక్కడ మట్టి కోతకు గురైందని జీఎం తెలిపారు. పట్టాలపై నిలిచిన నీరు దిగువకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంగళవారం సాయంత్రానికి పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications