Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడంగల్‌లో ఉద్రిక్తత: కల్వకుర్తిలో పరస్పర దాడి, సొమ్మసిల్లిన వంశీచంద్ రెడ్డి

Recommended Video

    Telangana Elections 2018 : High Tension In Kodangal, kalwakurthy And Warangal

    హైదరాబాద్/మహబూబ్‌నగర్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో నాగులపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భారీగా బలగాల మోహరించారు.

    కల్వకుర్తిలో కూడా ఉద్రిక్తత

    కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం ఉదయం పోలింగ్ సమయంలో గ్రామానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

    దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు తనపై రాళ్లతో దాడి చేశారని వంశీచంద్ రెడ్డి తెలిపారు. స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది.

    Tension in Kodangal, Attack on Vamshi Chand Reddy

    ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎంపీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై గొడవలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి భయంతో తెరాసపై దాడులు చేస్తున్నారని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+