దసరా లోగా రైతుల ఖాతాల్లో నిధుల జమ..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా లోగా నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధుల జమ పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో రైతు రుణమాఫీ మూడు విడతలు గా అమలు చేశారు. ఇంకా అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ పూర్తికాలేదు. దీంతో నాలుగో విడత రుణమాఫీగా వీరందరికీ నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవటం, ఆధార్ తప్పులు కారణంగా రుణమాఫీ పలువురికి నిలిచిపోయింది. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెలాఖరులోగా డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నారు.

TG government to clear loan waiver dues in coming Dussehra as reports

దసరా పండుగలోగా 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు నిధుల సర్దుబాటు పైన దృష్టి పెట్టింది. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం దాదాపు 22 లక్షల మంది రైతులకు రూ 17,934 కోట్ల రుణమాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల సంఖ్య 1. 26 లక్షల వరకు ఉంది. మొత్తం కలిపి 5.54 లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి.

దీనికి సంబంధించి ఆగస్టు 29 న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల నాలుగో తేదీ వరకు వీటిని స్వీకరించారు. ఏ బోలో క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపు పోలికి వచ్చింది. 4.28 లక్షల మంది రైతుల్లో 3.10 లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూప్ ఇన్ పూర్తయింది. ఈ మొత్తం లెక్కల పైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం దసరా లోగా వీరికి నాలుగో విడత రుణమాఫీ చేయాలని ఆలోచన చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+