TGPSC Group 1: గ్రూప్ 1 తీర్పుపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..!
తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారింది. గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాల్ని తిరిగి మూల్యాంకనం చేయించాలని, కుదరకపోతే పరీక్షనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని టీజీపీఎస్సీ ఇవాళ నిర్ణయించింది. ఈ మేరకు గ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రూప్ 1 జవాబు పత్రాల్ని రీవ్యాల్యూయేషన్ చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో డివిజన్ బెంచ్ లో ఈ వ్యవహారంపై తేల్చుకునేందుకు సిద్దమయ్యారు.

2024 అక్టోబర్ లో నిర్వహించిన తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను తాజాగా హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారించిన హైకోర్టు బెంచ్.. సంజయ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ రాజేశ్వర్ రావు ధర్మాసనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై ఇవాళ చర్చించిన టీజీపీఎస్సీ డివిజెన్ బెంచ్ లో అప్పీలుకు నిర్ణయించింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications