షాక్: ఇవాంకా హైద్రాబాద్ డ్రెస్ ఖర్చులతో కారు కొనొచ్చు
Recommended Video

హైదరాబాద్: జీఈఎస్ 2017 సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహదారు ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఇవాంకా ట్రంప్ ధరించిన మూడు డ్రెస్ల కోసం సుమారు 8,346 డాలర్లు ఖర్చు పెట్టారని సమాచారం. అయితే ఈ డ్రెస్కు పెట్టిన ఖర్చుతో ఒక మంచి ఖరీదైన కారును కొనుగోలు చేయవచ్చు.
జీఈఎస్ 2017 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హజరయ్యారు.ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనకు వచ్చారు.
జీఈఎస్ 2017 సదస్సులో ఇవాంకా ట్రంప్ అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరయ్యారు.

ఇవాంకా ధరించిన డ్రెస్లకు 8,346 డాలర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహదారు ఇవాంకా ట్రంప్ మొదటి రోజు ధరించిన మూడు డ్రెస్ల కోసం 8346 డాలర్లను ఖర్చు చేసిందంట,అంటే మన ఇండియా కరెన్సీలో దీని విలువ సుమారు 5లక్షల 37వేల రూపాయలు. ఈ డబ్బుతో మంచి కారును కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అయితే అగ్రరాజ్యానికి అధ్యక్షుడి కూతురైన ఇవాంకా ట్రంప్ ఆ మాత్రం డ్రెస్లకు ఖర్చు చేయడంలో ఆశ్చర్యం లేదంటున్నారు.

ఆ మూడు డ్రెస్లకు లక్షలు
రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ తొలి రోజున మూడు డ్రెస్లతో ఆహుతులను అలంరించారు.నవంబర్ 28వ, తేది తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన ఇవాంకా ట్రంప్ ముత్యాలు పొదిగిన జాకెట్ ధరించారు. ఈ డ్రెస్ ఖరీదు 1,298డాలర్లు ఉంటుందని డిజైనర్లు అంటున్నారు. మరో వైపు ప్రధాని మోదీని, సుష్మా స్వరాజ్ను కలిసి సదస్సులో ప్రసంగించిన సందర్భంలో ఆమె గ్రీన్ కలర్ డ్రస్ను ధరించారు. ఆ డ్రస్ విలువ 3,550 డాలర్లుగా సమాచారం. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న పుష్పాలు ఆమె ధరించిన డ్రస్తో ఫలక్నుమా ప్యాలెస్లో ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన విందుకు హజరయ్యారు. ఈ డ్రెస్కు
ఈ డ్రస్ ఖరీదు 3,498 డాలర్లుగా తెలిసింది. ఈ మూడు డ్రెస్లకు 8,346 డాలర్లు ఖర్చయినట్టు సమాచారం. అంటే మన కరెన్సీలో సుమారు 5లక్షల 37వేల రూపాయాలు.

కారు కొనుగోలు చేయవచ్చు
మధ్య తరగతికి చెందిన కుటుంబానికి చెందిన వారు ఇవాంకా ట్రంప్ తన దుస్తులకు చేసిన ఖర్చుతో కారును కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అయితే ఇండియాలో ఐదు లక్షలకు మంచి కంపెనీ కారు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అయితే ఇండియాలో పెద్ద పెద్ద పారిశ్రామిక వే్త్తలు తమ ఇంటిలో ఫంక్షన్ల సందర్భంగా ఈ తరహ దుస్తుల కోసం ఖర్చు చేస్తారు. కానీ, ఇవాంకా ఇండియా టూర్ కోసం ఉపయోగించిన డ్రెస్ కోసం లక్షలను ఖర్చుచేసిందని సమాచారం.

జీఈఎస్ 2017 సదస్సులో స్పెషల్ ఎట్రాక్షన్
జీఈఎస్ 2017 సదస్సులో ఇవాంకా ట్రంప్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. రెండు రోజుల పాటు ఆమె ఈ సదస్సులో పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలపై ఫోకస్ చేసే ఉద్దేశ్యంతోనే జీఈఎస్ 2017 ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం మేరకు 50 శాతానికి పైగా మహిళా ప్రతినిధులు ఈ సదస్సుకు హజరయ్యారు.అయితే 1600 ప్రతినిధుల్లో ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.












Click it and Unblock the Notifications