ఈ సర్కారీ స్కూల్స్ లో నో అడ్మిషన్స్ బోర్డులు.. సీట్ల కోసం తల్లిదండ్రుల పాట్లు!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఇటీవల కాలంలో గణనీయమైన మార్పులకు లోనవుతున్నాయి. గతంలో డ్రాపౌట్ సమస్యలు, తక్కువ విద్యార్థి సంఖ్యతో కష్టపడిన ఈ బడులు ఇప్పుడు అధునాతన సదుపాయాలు, నిపుణులైన ఉపాధ్యాయులు, డిజిటల్ బోధనా విధానాలు అమలు చేయడం ద్వారా తల్లిదండ్రుల మనసులను గెలుచుకుంటున్నాయి. ఫలితంగా అనేక పాఠశాలలు పూర్తి సీట్లతో నిండిపోయి, కొత్త విద్యార్థులను చేర్చుకోలేక 'ప్రవేశాలు లేవు' అని బోర్డులు పెట్టవలసి వస్తోంది.

వనపర్తి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశాలు ఇలా

కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు, పేద మరియు మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ఈ విజయానికి ముఖ్య కారణం. వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇందుకు చక్కటి ఉదాహరణ. గత సంవత్సరం 905 మంది విద్యార్థులతో నడిచిన ఈ బడిలో ఈ ఏడాది ప్రవేశాలు 1000 మందిని దాటాయి.

These telangana government schools with No Admission boards parents struggle to secure seats

తమ పిల్లలను జాయిన్ చేయటానికి పోటీ పడుతున్న తల్లిదండ్రులు

పదో తరగతిలోనే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలకు వసతి సౌకర్యాలు, బస్సు సౌకర్యం అందిస్తున్నారు. డిజిటల్ తరగతులతో పాటు హస్తకళలు, కరాటే, యోగా, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం వంటి అదనపు నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలు చూసి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

బోర్గాం ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. గతేడాది 1005మంది విద్యార్థులు చదివిన ఈ బడిలో ఈసారి అదనపు సీట్లు కల్పించాల్సి వచ్చింది. మార్చి నెలలోనే నాలుగు వందల మంది తల్లిదండ్రులు పేర్లు నమోదు చేయించుకున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ శిక్షణ, వృత్తివిద్యా కోర్సులు విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నాయి. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు ఇక్కడ పని చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు బలం చేకూరుస్తోంది.

సిద్దిపేట జిల్లాలోని ఇందిరానగర్ పాఠశాలకు పక్క జిల్లాల నుండి దరఖాస్తులు

సిద్దిపేట జిల్లాలోని ఇందిరానగర్ పాఠశాలలో 6, 8వ తరగతుల 210 సీట్లకు 691 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్, మంచిర్యాల వంటి ఇతర జిల్లాల నుంచి కూడా విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. సీఎస్‌ఆర్ నిధులతో అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు సన్నాహాలు చేయడం ఈ బడిని ప్రత్యేకం చేస్తోంది.

నల్గొండ జిల్లా బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ ల కోసం భారీ పోటీ

నల్గొండ జిల్లా బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. 550 సీట్లకు 3200 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత భవనం స్థానంలో రూ.8 కోట్లతో నాలుగు అంతస్తుల అధునిక భవనం నిర్మించారు. ఇక్కడ వాల్డోర్ఫ్ విద్యా విధానం అనుసరించి ఆలోచనా శక్తి, సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు.

అటవీ సంరక్షణలో విశిష్ట సేవలకు నగదు ప్రోత్సాహకాలతో అవార్డులు.. అమల్లోకి ఉత్తర్వులు!
అటవీ సంరక్షణలో విశిష్ట సేవలకు నగదు ప్రోత్సాహకాలతో అవార్డులు.. అమల్లోకి ఉత్తర్వులు!

కుమురం భీం జిల్లాలోని సావర్‌ఖేడ పాఠశాలకు భారీ డిమాండ్

కుమురం భీం జిల్లాలోని సావర్‌ఖేడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య వంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ఈ మార్పుకు కీలకం. తన వేతనంలో భాగం విద్యార్థుల కోసం ఖర్చు చేస్తూ, గురుకులాలు, నవోదయ విద్యాలయాల్లో సీట్లు సాధించడంలో విద్యార్థులకు సహాయపడుతున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ విద్యా రంగంలో సానుకూల మార్పును సూచిస్తున్నాయి. ఇలాంటి ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలు మరిన్ని ఏర్పాటు కావాలని అందరూ ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+