రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి: దంపతుల ఆత్మహత్య
వరంగల్: సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరియు ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కారెపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న ాా మ్యాజిక్ వాహనం మరియు లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
లారీలో నిర్మాణ సామాగ్రిని పెట్టుకొని ఇల్లెందు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనంలో కిక్కిరిసిన వాహనదారులు ఉండడం వల్ల ఎక్కువ మందికి గాయాలయ్యాయి.
కారేపల్లి పోలీసులు చనిపోయిన వారిలో ాా మ్యాజిక్ డ్రైవర్ రవి(40) మరియు ఇద్దరు అక్కాచెల్లెళ్లు షేక్ గౌసియా (24), షేక్ అశ్శు (20) వీరిద్దరు ఇల్లెందు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన లారీ డ్రైవర్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పురుగుల మందు తాగిన దంపతులు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు పురుగుల మందు తాగి భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన మికె మల్లేశ్ (48) పద్మ దంపతులు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఆరెపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.
వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరు వ్యవసాయంతోపాటు ఆో నటుపుతూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలతో వారు మనస్తాపానికి గురయ్యారు. ఇంో్ల పురుగుల మందు తాగగా భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
వరంగల్ రూరల్ జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ శివారులోని సైలానిబాబా దర్గా సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం నీి మడుగులో లభించినట్లు ఆత్మకూరు సీఐ రవికుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం... మృతుడికి సుమారు 50 ఏళ్ల వయసు కలిగి ప్యాంట్, తెల్ల బనియన్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.