వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు . ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా కావాలని హైదరాబాద్ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తన శాంతియాత్రకు సీపీ అనుమతి నిరాకరించడం పై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేయనివ్వకుండా అడ్డుకున్నారన్న ఆయన టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులకు ఏం చేసినా ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బంది పెడుతున్నారన్నారు..

సీపీ అంజనీ కుమార్ అవినీతిపై విచారణ జరిపించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తమిళిసై సౌందర రాజన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీ అంజనీకుమార్ ఫోన్ లో తనతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు . సెక్షన్ 8ను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని కోరామని , పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఇటీవల పోలీసులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .

 TPCC chief Uttam Kumar Reddy has complained governor over the police action

ఇక ఆయనపై విమర్శలు చేసిన ఉత్తమ్ ఆంధ్రా కేడర్ ఆఫీసర్ అయిన అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఉన్నతమైన పదవి ఇచ్చిందని, దీంతో వారికి జీహుజూర్ అంటూ ఈ కమిషనర్ అణచివేత ధోరణిలో ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా? ఎందుకు పోలీసులు తమ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వటం లేదు అని ప్రశ్నించారు. అంజనీ కుమార్ ప్రవర్తనపై విచారణ జరపాలని గవర్నర్‌ని కోరామని అన్నారు.

English summary
Telangana Congress chief Uttam Kumar Reddy today met Telangana Governor Tamilisai. On this occasion, MP Uttam Kumar Reddy and the Telangana congress leaders were angry and complained to the governor Tamilisai on telangana police . Uttam Kumar Reddy complains to the governor that the Hyderabad police are acting in an unnerving manner to prevent the Congress rallies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X