ప్రాధాన్యత లేదని మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
వికారాబాద్: పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన టిఆర్ఎస్ సభలో ఆయూబ్ఖాన్ అనే టిఆర్ఎస్ కార్యకర్త కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో మంత్రి మహేందర్రెడ్డి అక్కడే ఉన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో బుదవారం నాడు జరిగిన టీఆర్ఎస్ సభలో కలకలం చెలరేగింది. ఈ సభకు మంత్రి మహేందర్ రెడ్డి కూడా వచ్చారు. ఓ వైపు సభ జరుగుతుండగానే మరోవైపు ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆయూబ్ఖాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
వెంటనే స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు మంటలు ఆర్పేసి, చికిత్స కోసం ఆయనను హైదరాబాద్కు తరలించారు.. అయితే, ఇప్పటికే ఆ కార్యకర్త శరీరం అధిక భాగం కాలిపోయింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంగానే ఆయూబ్ఖాన్ ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడని పార్టీకార్యకర్తలు ప్రకటించారు.