టీడీపీ-వైసీపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు, ఆలోచించండి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళనకు తమ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు. ఆమె లోకసభలో బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వాళ్లకంటే పెద్ద మోసగాళ్లు: మోడీపై టీడీపీ, బీజేపీని మరోసారి ఏకేసిన గల్లా జయదేవ్
ఏపీలో తమ సోదరులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి మద్దతిస్తున్నానని చెప్పారు. విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో హామీలు ఇచ్చినప్పుడు అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు.
మిత్రపక్షాలే ఇలా ఆందోళన చేస్తే దేశంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కాబట్టి సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. జీఎస్టీ, నోట్ల రద్దుకు తాము మద్దతు పలికామని చెప్పారు. వ్యవసాయానికి ప్రాధాన్యత కావాలన్నారు. ఫెర్టిలైజర్ కంపెనీలపై కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ ఎందుకు చేస్తోందన్నారు.