తెలంగాణలో నిఫా వైరస్ లేదు: ఆ ఇద్దరి టెస్ట్ నెగిటివ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిఫా వైరస్ లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. విషజ్వరాలతో బాధ పడుతున్న ఇద్దరికి కేవలం అనుమానంతో చేసిన పరీక్షలు నెగెటివ్గా వచ్చాయని చెప్పారు.
వారి నమూనాలను పుణెలోని ఐసీఎంఆర్లో పరీక్షలు చేయించినట్లు చెప్పారు. ఒకరు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్సకు వెళ్ళగా ఫీవర్ ఆసుపత్రికి పంపించారని, నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించగా నిఫా వైరస్ లేనట్లు తేలిందని మంత్రి చెప్పారు. బాధితుడికి టైఫాయిడ్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారని, ప్రత్యేక వార్డులో చేర్పించి వైద్యం అందించి.. ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి పంపించారన్నారు.

తీవ్ర జ్వరంతో బాధపడుతూ మరో వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని, అనుమానంతోనే నిఫా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సదరు బాధితుడు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారని, ఆయనకు శస్త్ర చికిత్స చేయడానికి నిర్ణయించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు.
ప్రజలు ఎలాంటి అనుమానాలు, అపోహలకు పోవద్దని మంత్రి తెలిపారు. అన్ని రకాలుగా వైద్య శాఖ సిద్ధంగా ఉండటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications