హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ ఓ అపార్టుమెంటులోని ఇంట్లో ఇద్దరు అనుమానాస్పద మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఖైరతాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వారు ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయారు.

ఖైరతాబాద్‌లోని ఓ అపార్టుమెంటులో యువతి, యువకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వారిని మహేశ్వర్ రెడ్డి (25), వర్షశ్రీ (22)లుగా గుర్తించారు.

Two teenagers commit suicide in Hyderabad

ఇంట్లో రక్తం మరకలు, తీవ్ర గాయాలతో యువతి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో యువకుడి మృతదేహాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆ అపార్టుమెంటులోని ఇల్లు వర్షశ్రీదిగా తెలుస్తోంది. ఆమె ఇంట్లో వాళ్లు పెళ్లికి వెళ్లారు. యువతి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో మహేశ్వర్ రెడ్డి ఆమె ఇంటికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డిది బడంగ్‌పేటగా తెలుస్తోంది. ఎందుకు ఉరేసుకున్నారు... వారి ఏమవుతారు.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

English summary
Two teenagers commit suicide in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X