మహిళలను చంపేసి శవాలను కాల్చేశారు: సెక్స్ వర్కర్లుగా అనుమానం
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలో గల రంగారెడ్డి జిల్లాలోని జవహర్నగర్లో జంట హత్యలు స్థానికంగా తీవ్ర సంచలనం రేపాయి. ఇద్దరు మహిళలను చంపేసి, వారి శరీరాలను కాల్చేశారు. మహిళల మృతదేహాలు సగం కాలిపోయాయి. వారిని సెక్స్వర్కర్లుగా అనుమానిస్తున్నారు.
దుండగులు గొంతుకోసి మహిళలను దారుణంగా హత్యచేశారు. కౌకూర్ గ్రామంలోని వెంకూష ఎస్టేట్ పక్కనున్న ఖాళీ ప్రదేశంలో మహిళల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

స్థానికంగా ఉండే చిన్నారులు క్రికెట్ ఆడుతుండగా బంతి మహిళల మృతదేహాల వద్ద పడింది. దీంతో ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో డీసీపీ రామచంద్రారెడ్డి, అల్వాల్ ఏసీపీ రఫీక్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులెవరనే వివరాలతో పాటు, హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగర శివారులోని హయతనగర్లో గొలుసు చోరీ జరిగింది. లెక్చరర్స్ కాలనీలో ఓ దుండగుడు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications