ఢిల్లీ యువతితో విమానాశ్రయంలో అసభ్య ప్రవర్తన, హైదరాబాదీల అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళను వేధించిన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకొని, కేసు నమోదు చేశారు.
ఇద్దరు వ్యక్తులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్ష
మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడుపుతూ రెండోసారి పట్టుబడ్డ ముగ్గురు మందుబాబులకు ఒక్కొక్కరికీ పదిహేను రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు తొలి వారాంతంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా 112మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో దొరికారు. ఎర్రమంజిల్ కోర్టులో మంగళవారం హాజరుపరచగా ట్రాఫిక్ పోలీసుల నివేదికలను పరిశీలించిన అనంతరం మెజిస్ట్రేట్ వీరికి వేర్వేరుగా జైలు శిక్షలు విధించారు.
ఒకరోజు నుంచి పది రోజుల్లోపు 58 మందికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 41మందిని కోర్టు సమయం పూర్తయ్యేంతవరకూ నిలబడి ఉండాలని, పోలీసులు సూచించిన ప్రాంతాల్లో ఒకరోజు సామాజిక సేవ చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.